telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

భర్తను వదిలి, స్నేహితుడితో వెళ్లి.. సిక్కింలో చిక్కిన తెలుగు డాక్టర్!

steth doctor

దేశ రాజధాని ఢిల్లీలో ఐదు రోజుల క్రితం చర్చ్ కి వెళ్లి వస్తామని చెప్పిన డాక్టర్ హిమబిందు, దిలీప్ లు అదృశ్యమైన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ పోలీసులు సిక్కింలో గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. దిలీప్, హిమబిందులు సిక్కింలో చిక్కారని, సోషల్ మీడియా, వారి ఫోన్ నంబర్ల ట్రాకింగ్ ఆధారంగా గుర్తించామని పోలీసులు తెలిపారు. భర్తను వదిలేయాలని నిర్ణయించుకున్న హిమబిందు, తన సహచర విద్యార్థి, డాక్టర్ వృత్తిలోనే ఉన్న దిలీప్ తో కలిసి వెళ్లినట్టు ప్రాథమికంగా నిర్దారించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

చండీగఢ్‌ లో పీడియాట్రిషియన్‌ గా పనిచేస్తున్న దిలీప్, ఓ ఇంటర్వ్యూ నిమిత్తం వచ్చి, ఢిల్లీలోని శ్రీధర్, హిమబిందు దంపతుల ఇంట్లో దిగారు. వీరంతా గతంలో కర్నూలు మెడికల్ కాలేజిలో కలిసి చదువుకున్నారు. 25న క్రిస్మస్ సందర్భంగా చర్చ్ కి వెళుతున్నానని భర్తకు ఫోన్ లో చెప్పిన హిమబిందు, ఆపై అదృశ్యం అయింది. దీంతో శ్రీధర్ వారి ఆచూకీ కనిపెట్టాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్లను అభ్యర్థించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు.

Related posts