telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

జర్నలిస్టుపై కాల్పులు..పరిస్థితి విషమం!

gun fire

విక్రమ్ జోషి అనే జర్నలిస్టుపై సోమవారం రాత్రి ఢిల్లీ సమీపంలో కాల్పులు జరిగాయి. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘజియాబాద్‌లోని విజయ్‌నగర్‌ ప్రాంతంలో రహదారిపై ఈ దాడి జరుగ్గా సీసీ ఫుటేజిలో రికార్డు అయ్యింది. జోషి తన ఇద్దరు కుమార్తెలతో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేయడంతో బైక్‌ అదుపుతప్పి కిందపడింది.

దీంతో కొండర్ వ్యక్తులు బైక్‌ను చుట్టుముట్టి జోషిపై దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో జోషి ఇద్దరు కూతుళ్లు అక్కడి నుంచి పరిగెత్తారు. జర్నలిస్టుపై దాడి చేస్తూ ఒక్కసారిగా కాల్పులు జరిపి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో పడిపోయిన జోషి వద్దకు అతడి పెద్ద కుమార్తె వచ్చి రోధిస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి జోషిని ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. జోషి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts