చిత్రపరిశ్రమకు రాజకీయాలతో సంబంధం లేదని సీనియర్ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరులో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ అద్దాలమేడలాంటిదని, దాన్నుంచి చూస్తూ అర్థం చేసుకున్న వారి దృక్పథంపై దాని తీరు ఆధారపడి ఉంటుందన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా,ముఖ్యమంత్రి ఎవరైనా వారిని అభిమానిస్తామని తెలిపారు.
ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపు వల్ల ఎంతో మేలు జరుగుతుందని, ఇందుకోసం పోరాడుతున్నామని అన్నారు. ఉత్తరాంధ్రలోని నదులతో గోదావరిని అనుసంధానిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, రిటైర్ అయ్యాక ఆలోచిస్తానని తెలిపారు.గతంలో రెండు సార్లు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేయాలని కోరితే తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దును నారాయణమూర్తి సమర్థించారు.
అచ్చెన్నాయుడి తీరును చూసి రాష్ట్రం అసహ్యించుకుంటుంది: రోజా