telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

జగన్ పాలనలో రైతులు చాలామంది చనిపోయారు : నారా లోకేష్

Nara Lokesh

రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు అని నారా లోకేష్ అన్నారు. పాదయాత్రలో తమది రైతు రాజ్యం అని చెప్పిన జగన్ ఇపుడు రైతు లేని రాజ్యం తెస్తున్నారు అని తెలిపాడు. లోకేష్ మాట్లాడుతూ… జగన్ పాలనలో రైతులు చాలామంది చనిపోయారు, వరదలు వస్తే ఇక్కడ కనీసం సహాయ చర్యలు లేవు. ప్రభుత్వ యంత్రాంగం కనీసం స్పందించడం లేదు అని అన్నారు. వరద వస్తుందని తెలిసిన ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయలేదు ప్రధాని ఫోన్ చేసిన తర్వాతే ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలో మాట్లాడే మంత్రిగారు ఇక్కడకు వచ్చి వాస్తవాలు చూడాలి అన్నారు. రైతుల ఇబ్బందులను కన్నబాబు పరిశీలించాలి. కనీసం రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం లేదు. హుద్ హుద్ సమయంలో రెండు రోజుల్లో విశాఖలో విద్యుత్ పునరుద్ధరణ చేశాం. కానీ ఇపుడు కరెంటు పోతే ఎపుడు వస్తుందో తెలియదు అని చెప్పారు. అడుగడుగునా రైతులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇపుడు ఉచిత విద్యుత్ ఎత్తి వేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. అందుకే మీటర్లు పెట్టాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనిపై గట్టిగా పోరాడుతుంది అన్నారు. గతేడాది వరద నష్ట పరిహారం ఇంకా ఇవ్వలేదు. రాష్ట్రంలో మొత్తం కలిపి 25 లక్షల రూపాయలు పరిహారం ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. వరదల పై ముఖ్యమంత్రి ముందుగా సమీక్ష చేసి ఉంటే ఇపుడు ఇబ్బందులు తప్పేవి. ముఖ్యమంత్రి ఎందుకు బయటకు రావటం లేదు… వరద ప్రాంతాల్లో ఎందుకు పర్యటించటం లేదు అని ప్రశ్నించారు. సాగు నీటి మోటార్లకు మీటర్లు బిగించటాన్ని తెదేపా అంగీకరించదు రైతుల తరపున మేం పోరాటం చేస్తాం అని తెలిపారు.

Related posts