కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువాను ఆయన కప్పుకున్నారు. బీజేపీలోకి సింధియాను నడ్డా సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాయలయంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. బీజేపీలో చేరిన సింధియాను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.