“కింగ్” నాగార్జున హీరోగా దాదాపు పన్నేండేళ్ల క్రితం వచ్చిన “మన్మథుడు” చిత్రం ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒకటి. ఆ సినిమాకు ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయిత. ఆ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగులను ఇప్పటికీ చాలా మంది గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “మన్మథుడు-2”. ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్లో కూడా లిప్లాక్ సన్నివేశాలను చూపించారు. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ కంప్లీటైంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో “మన్మథుడు” క్రెడిట్ మొత్తాన్ని నాగార్జున దర్శకుడు విజయ్ భాస్కర్ ఖాతాలోనే వేశారు. త్రివిక్రమ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు జవాబుగా నాగార్జున.. ఈ విషయంపై స్పందించారు. “నాకు మన్మథుడు కథ చెప్పింది విజయ్ భాస్కర్ గారే. ఆయన రోజూ నన్ను కలిసి కథ గురించి చర్చించేవారు. నాతో పంచ్ లు చెప్పింది కూడా ఆయనే. అందుకే ఆయన గురించే మాట్లాడాను.. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్” అంటూ త్రివిక్రమ్ గురించి మాట్లాడేందుకు నాగార్జున ఇష్టపడలేదు.
కీర్తి సురేష్ తాజా లుక్ పై వర్మ కామెంట్స్