ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జార్జి అలెగ్జాండర్ పై కొచ్చిలో దాడి జరిగింది. ఆయన కారులో వెళుతుండగా మధ్యలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. కారుపై రాళ్లు రువ్వడంతో ఆయనకు బలమైన గాయాలయ్యాయి. కారు ధ్వంసమైంది. మరో కారులో వచ్చిన సిబ్బంది తీవ్రంగా గాయపడ్డ జార్జి అలెగ్జాండర్ ను ఆసుపత్రికి తరలించారు.
ముత్తూట్లో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులు కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్నారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనలు, ధర్నాలు చేపడుతుండడంతో కొందరు ఉద్యోగులపై ముత్తూట్ ఫైనాన్స్ వేటు వేసింది. దీన్ని నిరసిస్తూ కొందరు ఉద్యోగులు నిరసన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా సాగింది. ఈ దాడి పై పలు సందేహాలు వెల్లువిరుస్తున్నాయి.