telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

పుల్వామా ఎన్‌కౌంట‌ర్‌ లో ముగ్గురు ఉగ్ర‌వాదుల హ‌తం

kashmir encounter

జ‌మ్ముక‌శ్మీర్‌ పుల్వామా జిల్లాలో ఈ రోజు తెల్ల‌వారుజామున జ‌రి‌గిన ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ జ‌వాన్ కూడా మృతి చెందాడు. జిల్లాలోని జ‌డూరా ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ ప్రారంభ‌మైంద‌ని ఆర్మీ ప్ర‌తినిధి క‌ల్న‌ల్ రాజేష్ క‌లియా తెలిపారు. భ‌ద్ర‌తా ద‌ళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌వ‌గా, ఓ జ‌వాన్ తీవ్ర‌గా గాయ‌ప‌డ్డాడ‌ని తెలిపారు.

గాయపడ్డ ద‌‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే జ‌వాన్ మ‌‌‌ర‌ణించాడ‌ని వెల్ల‌డించారు. ఉగ్ర‌వాదుల కోసం గాలింపు కొన‌సాగుతున్న‌ద‌ని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం షోపియాన్ జిల్లాలో జ‌రిగిన ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌ట్టుపెట్టాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌ నేపథ్యంలో జ‌మ్ముక‌శ్మీర్‌ ప్రాంతంలో భ‌ద్ర‌తా ద‌ళాలు కూంబింగ్ చేపట్టారు.

Related posts