telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ను మర్చిపోరు: మోత్కుపల్లి

Mothkupally pays tributes to NTR
తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను మర్చిపోరని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్‌ 23వ వర్థంతి సందర్భంగా మోత్కుపల్లి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాన్యులను మంత్రులను చేసిన ఘనత ఎన్టీఆర్ దే అని అన్నారు. మహనీయుడు, బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఒక వ్యవస్థను సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని మోత్కుపల్లి కొనియాడారు. 
రాజకీయంగా చైతన్యం కలిగించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆయన ప్రారంభించిన పథకాలనే నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. టీడీపీని టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని అంటే నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారన్నారు. తెలంగాణలో టీడీపీ అంతరించి అంతరించిపోయిందన్నారు. తెలంగాణలో ఎన్టీఆర్ జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని మోత్కుపల్లి అన్నారు.

Related posts