telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా కట్టడికి… కెసిఆర్ సంచలన నిర్ణయం

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిహెచ్ఎంసి ప్రాంతాలలో కోవిడ్ పై జోనల్ కమిషనర్లు మరియు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్లతో టెలి-కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రం మరియు బస్తీ దవాఖానాల్లో ఔట్ పేషెంట్ క్లినిక్ ను ప్రారంభించాలని చీఫ్ సెక్రటరీ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. కరోనా రోగలక్షణం వున్న వ్యక్తులందరికీ వారికి హోం ట్రీట్ మెంట్ కిట్లను అందజేయాలని ఆయన ఆదేశించారు.

టెలికాన్పరెన్స్ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు:
———————————————-
• మున్సిపల్ స్టాఫ్, ఎఎన్ఎమ్ మరియు కనీసం ఇద్దరు ఆశా వర్కర్లతో బృందాలను ఏర్పాటు చేయాలి

• జ్వరం మరియు ఇతర లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించడానికి బృందాలు ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటినీ సందర్శించాలి. ఈ బృందాలు మెడిసిన్ కిట్లను అప్పగిస్తాయి. కరోనా రోగ లక్షణాలున్న వ్యక్తులకు వాటిని ఎలా తీసుకోవాలో సలహా ఇస్తాయి. కరోనా రోగులను అనుసరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.

• అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరియు బస్తీ దవాఖానాలలో పరిశుభ్రత డ్రైవ్ చేపట్టడం. దవాఖానాలో పరిశుభ్రమైన పరిస్థితులను నిర్వహించడానికి దవాఖానా ప్రాంగణాన్ని చీకటిప్రదేశాలు లేకుండా కాంతివంతంగా వుంచడానికి వైట్ వాషింగ్ మొదలైన చర్యలు చేపట్టాలి

• అన్ని సర్కిల్‌లలో కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలి

ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.ఎ.ఎం. రిజ్వి, జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్, వైద్య విద్య డైరెక్టర్ శ్రీ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీ జి. శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts