ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామకం కోసం ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ మేరకు 11 జిల్లాల కలెక్టర్లు ప్రకటనలు జారీ చేశారు. నెల్లూరు, ప్రకాశం మినహా అన్ని జిల్లాల్లో నియామక ప్రకటనలు విడుదలయ్యాయి. 11,077 పంచాయతీల్లో 1,56,437 వాలంటీర్లను నియమించనున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున నియమిస్తారు.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,072 పంచాయతీల్లో 21,600 వాలంటీర్లను నియమించనున్నారు. రేపటి నుంచి జులై 5 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు gramavolunteer.ap.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వలంటీర్లకు ఆగస్టు 1 నాటికి సమాచారం ఇస్తారు. ఆగస్టు 5 నుంచి 10 వరకు ఎంపికైన వలంటీర్లకు శిక్షణ ఇస్తారు. ఆగస్టు 15 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.