ప్రభుత్వం దగ్గర సత్తా ఉంటేనే ఐపీఎల్, రంజాన్, పరీక్షలు అన్నీ సవ్యంగా సాగుతాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని శాసించే విధంగా మన ఎదగాలన్నారు. ప్రభుత్వం దగ్గర సత్తా ఉంటే, ఎన్నికలు.. ఐపీఎల్ టోర్నీ ఒకేసారి జరగడం సాధ్యం అవుతుందని ప్రధాని అన్నారు. గత రెండు సార్లు ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఐపీఎల్ నిర్వహించలేకపోయాయన్నారు.
అధికారంలో ఉన్న ప్రభుత్వం భారీ మెజారిటీతో రెండోసారి మళ్లీ అధికారంలోకి రాలేదని తెలిపారు. కానీ ఈసారి అది సాధ్యం కాబోతుందని అన్నారు. మరింత పెద్ద మెజారిటీతో మళ్లీ 2019లో అధికారంలోకి వస్తామన్నారు. 2014లో ఎన్నికల ఫలితాలు మే 16వ తేదీన వచ్చాయని, మే 17వ తేదీన భారీ నష్టం జరిగిందని గుర్తు చేశారు. ఇవాళ కూడా మే 17వ తేదీ అని కాంగ్రెస్ గెలుస్తుందని బెట్టింగ్ పెట్టినవాళ్లంతా నష్టాన్ని చవిచూస్తారని జోస్యం చెప్పారు.