telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

cell phone

రాజస్థాన్ రాజధాని జైపూర్‌ పట్టణ పరిసర ప్రాంతాల్లోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు పోలీసు అధికారులు ప్రకటించారు. జైపూర్‌లోని శాస్త్రి నగర్ ప్రాంతంలో సోమవారం ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సోషల్‌మీడియాలో ఈ దారుణ ఘటనపై వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ఇప్పటికే పలు సమస్యాత్మక ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపేసింది. అయితే తాజాగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేతను శుక్రవారం వరకు పొడిగించింది. సమస్య తీవ్రతరం కాకుండా సదర్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను శుక్రవారం వరకు నిలిపేస్తున్నట్లు సిటీ డివిజనల్ కమిషనర్ కేసీ వర్మ వెల్లడించారు.

Related posts