telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ఖజానా ఖాళీ అయింది.. మోదీకి వైసీపీ ఎంపీ లేఖ

Mithun Reddy Ycp MP

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాశారు. ఆర్థిక వనరులు అడుగంటిపోయాయని లేఖలో పేర్కొన్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పేదలకు ఆర్థిక సాయంతో ఖజానాపై తీవ్రమైన భారం పడిందని పేర్కొన్నారు.

దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి కూడా ఇదే మాదిరి ఉందని లేఖలో ప్రస్తావించారు. జీడీపీలో 8 నుంచి 10 శాతం వరకు ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. పరిశ్రమలు, వ్యాపారాల రుణాల రికవరీని ఏడాది పాటు వాయిదా వేయాలని విన్నవించారు. ద్రవ్య లోటును అధిగమించేందుకు ఆర్బీఐతో కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts