మనం బతకాలంటే ప్రతీ రోజు అన్నం తింటాం. తినక తప్పదు మరి. తినక పోతే… మన ఆరోగ్యం చెడిపోతుంది. అయితే… మనం భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగాలా? వద్దా? అనే సంధిగ్ధం అందరిలోనూ ఉంటుంది. భోజనానికి ముందు ముందు నీరు తాగితే..శరీర బలహీనతకు దారి తీస్తుందని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగితే స్థులకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అందుకే భోజనం చేసేటప్పుడు సిప్ చేసినట్లు… కొంచం కొంచం నీళ్ళు తాగాలి. ఇదే ఉత్తమమైన పద్ధతి అని నిపుణులు సలహాలు ఇస్తున్నారు. ఇలా చేస్తే జీర్ణక్రియ సజావుగా జరుగుతుందట. ఈ సలహాలు పాటించకపోతే… ప్రమాదాలు తప్పవని వైద్యులు పేర్కొంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించాలి.
previous post
బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు