telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ బడ్జెట్ పై మంత్రి తలసాని హర్షం

talasani srinivasayadav on clp merger

తెలంగాణ బడ్జెట్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని, డబుల్ బెడ్ రూం పథకానికి రూ.11,917 కోట్లు ప్రతిపాదించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతఙ్ఞతలు తెలిపారు.

సమైక్య పాలనలో హైదరాబాద్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు.నాలుగు వందల ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ నగరం అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందిందన్నారు. ప్రతి డివిజన్ కు రెండు బస్తీ దవాఖానాలు ఉండే విధంగా, 350 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

 

Related posts