పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.కరోనా పరీక్షల నిమిత్తం ఆయన నుంచి వైద్యులు శాంపిళ్లు సేకరించారు. వాటి ఫలితాలు ఈ రోజే వచ్చే అవకాశం ఉందని ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడు ఫైసల్ సుల్తాన్ తెలిపారు. ఇమ్రాన్ ఈ నెల 15వ తేదీన ఇస్లామాబాద్లో ప్రముఖ దాత, ఎధి ఫౌండేషన్ చైర్మన్ ఫైసల్ ఎధిని కలిశారు.
ఈ సందర్భంగా ఎధి.. కరోనా వైరస్ సహాయ నిధి కోసం రూ. పది మిలియన్ రూపాయల చెక్ను ప్రధానికి అందజేశారు. ఇక ఇమ్రాన్ను కలిసిన కొద్ది రోజులకే ఎధిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. లక్షణాలు నాలుగు రోజుల పాటు ఉండడంతో ఆయనకు పరీక్షలు చేయగా.. కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దాంతో అప్రమత్తమైన ఇమ్రాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లి, కరోనా పరీక్ష చేయించుకున్నారు.
మొన్నటి వరకు మోదీతో..ఇప్పుడు రాహుల్ జపం