ఖాళీ ప్రదేశాలలో చెత్తను వేయవద్దని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైద్రాబాద్ అమీర్పేట డివిజన్ పరిధిలోని కుమ్మరి బస్తీలో ఆదివారం ఆయన పర్యటించారు. అధికారులతో కలిసి పట్టణ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దోమల నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూపరిసరాలను పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమని అన్నారు.
పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం వల్ల దోమలు వ్యాప్తి చెంది పలు రోగాల బారినపడే ప్రమాదం ఉందన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నిర్మూలనపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
బీసీలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపించారు: యనమల