మెగాస్టార్ చిరంజీవి, ఉగాది పర్వదినం సందర్భంగా పలు సోషల్ మీడియా మాద్యమాల్లోకి అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా ప్రముఖులు ఆయనను సోషల్ మీడియాలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ తమ అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. అందులో భాగంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ట్విట్టర్కి స్వాగతం మిత్రమా అంటూ మెగాస్టార్ను ఉద్దేశించి ట్వీట్ చేయగా, ‘రాననుకున్నావా, రాలేననుకున్నావా’ అంటూ సరదాగా మోహన్ బాబు ట్వీట్ని మెగాస్టార్ రీట్వీట్ చేశారు. దానికి సమాధానంగా మోహన్ బాబు, ‘ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెప్తాను’ అని రిప్లై ఇచ్చారు. మొదటి నుండి టాలీవుడ్లో ఈ ఇద్దరు అగ్రనటుల మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం చిరంజీవి చేసిన ఆ ఫన్నీ ట్వీట్ పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
previous post
next post
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా షూటింగ్స్ చేయడం చాలా కష్టం : సి. కళ్యాణ్