telugu navyamedia
సినిమా వార్తలు

‘భీమ్లానాయక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌..

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటిల భారీ మల్టిస్టారర్‌ చిత్రం ‘భీమ్లా నాయక్‌’. దర్శకుడు సాగర్‌ కె.చంద్ర తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచారు మూవీ యూనిట్ . ఇప్ప‌ట‌కే విడుద‌లైన సాంగ్స్‌, ట్రైల‌ర్ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీ పై ఇండస్ట్రీలో చాలా అంచనాలే భారీగా ఉన్నాయి.

ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ‘భీమ్లానాయక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకను-* సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా ఈవెంట్‌ జరగనుంది. ఈ వేడుకకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నిజానికి ఈ వేడు సోమవారం జరగాల్సి ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గౌతమ్‌ రెడ్డి అకాల మరణంతో వాయిదా వేశారు.

ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా బుధవారం సాయంత్రం పలు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అంతేకాదు..ప్రీ రిలీజ్ కోసం నిర్ధేశించిన పాసులు ఉన్న వారికే పోలీసులు అనుమతి ఇస్తారు. ఈ నెల 21న ఈవెంట్ పాసులున్న వారికి కాకుండా రేపటి కోసం కొత్త పాసులున్నవారికే అనుమతి ఇస్తారట.

అభిమానులు సొంత వాహనాల్లో కాకుండా.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వస్తే మంచిదని సూచిస్తున్నారు. పాసులు లేని వారికి ఈవెంట్ నిర్వహించే స్థలంలో అనుమతించరు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ప్రాంతానికి పాసులు లేకుండా వచ్చి గొడవ పడితే.. వాళ్ల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 వరకు యూసుఫ్ గుడ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలియజేసారు. ప్రీ రిలీజ్ కోసం వచ్చే వరకు నిర్ధేశిత ప్రదేశాల్లోనే తమ వాహనాలను పార్కింగ్ చేయాలని చెప్పారు..

Related posts