చివరిగా గద్దలకొండ గణేష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ తన పదవ సినిమాకి సన్నద్దమవుతున్నాడు. వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ చిత్రం తర్వాత బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఇందులో కథానాయికలుగా నభా, నిధిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నట్టు టాక్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుండగా, ఈ మూవీ కోసం కొన్నాళ్ళుగా బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు వరుణ్ . బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాక్సర్గా కనిపించనున్నాడు వరుణ్ తేజ్. అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ బాణీలు సమకూరుస్తున్నారు. తాజాగా వరుణ్ లుక్కి సంబంధించి ఓ ఫోటో విడుదలైంది. ఇందులో వరుణ్ భారీగా గెడ్డం పెంచి రాకింగ్ లుక్లో కనిపిస్తున్నారు. మరి కొద్ది రోజులలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.
previous post