telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

వరల్డ్ కప్ : వర్షం కారణంగా ఆగిన మ్యాచ్

World-Cup-Stop

మాంచెస్టర్‌లో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో ఇవాళ తలపడుతోంది. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5వ వికెట్‌ను కోల్పోయింది. ఆ జట్టు బ్యాట్స్‌మన్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. న్యూజిలాండ్ స్కోరు 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం పడడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.

Related posts