telugu navyamedia
సినిమా వార్తలు

చరణ్ తో రకుల్ రాయబారాలు… ప్రయత్నాలు ఫలించేనా ?

Rakul

టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోయిన్ల సరసన అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతోంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది రకుల్. సినీ రంగంలోకి ప్ర‌వేశించి ద‌శాబ్దం కావొస్తున్నా ఇప్ప‌టికీ అదే గ్లామ‌ర్‌ను మెయింటైన్ చేస్తూ అవ‌కాశాలు అందుకుంటోంది. రకుల్ “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”తో తెలుగు వారికి దగ్గరైంది. ఆ తరువాత ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్య తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. ప్రస్తుతం ఈ భామ సినీ కెరీర్ ప్రస్తుతం కొంత స్లోగా సాగుతోంది. కోలీవుడ్ లో అక్కడ హీరోలతో తన ప్రయత్నాలు కొనసాగించింది. కోలీవుడ్ లో కూడా ఆమెకు చెప్పుకోతగ్గ క్రేజ్ ఏర్పడలేదు. ప్రస్తుతం ఆమె నితిన్ తో చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ తప్ప ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడ లేదు. ఇలాంటి పరిస్థితులలో ఆమె రామ్ చరణ్ తో చేస్తున్న రాయబారాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మూవీలో ఇద్దరి హీరోయిన్స్ కు అవకాశం ఉంది. ఈ మూవీలో తనకు సెకండ్ హీరోయిన్ పాత్ర ఇచ్చినా తనకు అభ్యంతరం లేదు పారితోషికం గురించి కూడ తాను పట్టించుకొను అని ఆమె చరణ్ తో చేస్తున్న రాయబారాలు కొరటాల దృష్టి వరకు వెళ్ళినట్లు టాక్. అయితే ఈ రాయబారాలకు అటు చరణ్ కాని ఇటు కొరటాల కాని స్పందించడం లేదు అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. దీనితో రకుల్ ప్రీత్ అటు సీనియర్ హీరోలకు ఇటు యంగ్ హీరోలకు ఎవరికీ ఆసక్తి కనపరచని హీరోయిన్ గా మారిపోయింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related posts