బాలీవుడ్ నటి, మాజీ మోడల్ మహిమా చౌదరి దక్షిణాది నటులపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ సినిమాల గురించి తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మహిమా చౌదరి పాల్గొన్నారు. తనకు హైదరాబాద్తో మంచి అనుబంధం ఉందని, రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోలలో ఎన్నో సినిమాలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తన తల్లి నగరంలోని చార్మినార్ దగ్గర గాజులు ఎంతో ఇష్టంగా కొనుక్కొనేవారన్నారు. హైదరబాదీ బిర్యానీ గురించి సల్మాన్ చెప్పాడని, కానీ తను వెజ్టేరియన్ కావడం వల్ల దానికి దూరంగా ఉన్నానన్నారు. అయితే డబుల్ కా మీటా బాగా తినేదాన్నని అన్నారు. టాలీవుడ్లో చిరంజీవి రొమాంటిక్ ఉంటారని, ఆయన కళ్లు బాగుంటాయని, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా రొమాంటిక్ గా ఉంటారని తెలిపారు. నాగార్జునతో ఓ సినిమా అవకాశం వచ్చినా కుదరలేదన్నారు. రజినీకాంత్కు తాను పెద్ద అభిమానినని, ఆయన స్టైల్స్ బాగా నచ్చుతాయన్నారు. ఇక దక్షిణాదిన ప్రియదర్శన్, నమ్రతా శిరోద్కర్, నాగార్జునలు బాగా పరిచయమని తెలిపారు. మహేశ్ బాబు నటుడిగా తెలుసుకానీ.. ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. తెలుగు సినిమాల డబ్బింగ్ విషయంలో చాలా ఇబ్బంది పడేదాన్ని అని, అంకెలు చదవమని చెప్పేవారన్నారు. హావభావాలు లేకుండా కేవలం అంకెలు చెప్పడానికి ఇష్టపడేదాన్ని కాదని తెలిపారు.
previous post
ఆ సినిమా అంటే చంద్రబాబుకు భయం: లక్ష్మీపార్వతి