telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”పై మహేష్ ప్రశంసలు… కారణం ఇదేనా ?

Mahesh-and-Chiru

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన చిత్రం “సైరా న‌ర‌సింహారెడ్డి”. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో న‌టించారు. తన కలల ప్రాజెక్ట్ “సైరా”ను తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా పట్టాలెక్కించాడు చిరు. ఈ సినిమా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల చేశారు. చరిత్ర గుర్తించని వీరుడి కథ అంటూ అక్టోబర్ 2 మహాత్మగాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా డైరక్షన్, మెగాస్టార్ చిరంజీవి నటన, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్ని సినిమాను కాపాడాయని చెప్పొచ్చు. అయితే అసలు కథకు మసాలా కోటింగ్ ఎక్కువైందన్న టాక్ నడుస్తోంది. “సైరా” మూవీపై మహేష్ బాబు స్పందించారు. అయితే సినిమా మొదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు వెళుతోంది. ఇక చిరంజీవి నటన పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు చిరంజీవి నటన అద్భుతం అమోఘం అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం పై స్పందించారు. దృశ్యపరంగా సైరా సినిమా రిచ్ గా అద్భుతంగా ఉందని, మెగాస్టార్ చిరంజీవి నట విశ్వరూపం చూపించారని, సైరా తప్పక చూడాల్సిన సినిమా అని తెలిపారు. నిర్మాతగా వ్యవహరించిన రాంచరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు చిత్ర బృందానికి శుభాభినందనలు అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు మహేష్. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యిందని, రత్నవేలును ప్రత్యేకంగా అభినందించారు సూపర్ స్టార్. ఎందుకంటే రత్నవేలు ప్రస్తతం మెగాస్టార్ తో కలిసి “సరిలేరు నీకెవ్వరూ” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.ఇక “సైరా”కు మహేష్ బాబు ట్వీట్ చేయడం కొంత ప్లస్ అవుతుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా సినిమా చూస్తారు. సైరాకు ఇలా కూడా ప్రమోషన్ లభిస్తున్నట్లే.

Related posts