telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

మహానందిలో రోడ్డుపైకి వచ్చిన చిరుత

Leopard

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మొన్నటి వరకు రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. దీంతో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. రోడ్లపైకి వస్తున్న చిరుతలు, ఇతర అటవీ జంతువులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో నడిరోడ్డుపైకి వచ్చిన ఓ చిరుత ప్రజలను వణికించింది. తిరుమల ఘాట్ రోడ్డులోనూ వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇంతవరకూ చిరుతపులులు జనావాసాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా కర్నూలు జిల్లా మహనంది పుణ్యక్షేత్రం సమీపంలో కనిపించిన చిరుత ఓ పందిపిల్లను పట్టుకుని చెట్టెక్కింది. గమనించిన పందులన్నీ ఒక్కసారిగా అరవడంతో పందిపిల్లను వదిలేసి అడవివైపు వెళ్లి పొదల్లో నక్కి మాటువేసింది. ఆ తర్వాత కాసేపటికే పందులపై దాడిచేసి ఓ పందిపిల్లను నోట కరుచుకుని అడవిలోకి వెళ్లిపోయింది. గమనించిన గోశాల కాపలాదారు దేవస్థానం అధికారులు స్థానికులకు సమాచారం అందించడంతో వారొచ్చి చిరుత కోసం గాలిస్తున్నారు.

Related posts