telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్రం పై కేటీఆర్ ఆగ్రహం

KTR Counter pawan comments

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రైల్వే ప్రాజెక్టును కూడా కేటాయించలేదని మండిపడ్డారు. కొత్తగా రైల్వే సర్వీసులు లేవు. కొత్త రైల్వే లైను లేదు. కొత్త మార్గాల కోసం సర్వే కూడా నిర్వహించలేదని విరుచుకుపడ్డారు.

ఇక బుల్లెట్ రైలు, హైస్పీడ్ రైళ్ల ఊసే లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్ పెంపు లేదు. బడ్జెట్ కేటాయింపుల్లో ఈసారి తెలంగాణనకు మొయిడిచేయి. ఇవన్నీ చూస్తుంటే బుల్లెట్ రైలు, హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టులకు దక్షిణ భారతం అనర్హమైనదిగా భావిస్తున్నారేమో అని కేటీఆర్ ట్విటర్ లో పేర్కొన్నారు.

Related posts