తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను సీఎం కేసీఆర్ సోమవారం రాజ్ భవన్ లో కలిశారు. దాదాపు రెండున్నర గంటల పాటు గవర్నర్ తో కేసీఆర్ వివిధ అంశాల పై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ యాక్ట్, ఆర్టీసీ ప్రైవేటీకరణతో పాటు పలు అంశాలపై గవర్నర్తో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది.
ప్రధానంగా ఆర్టీసీపై ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను కేసీఆర్ గవర్నర్కు వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి కూడా కేసీఆర్ గవర్నర్తో చర్చించినట్టు సమాచారం.
మే 23న వైసీపీ దుకాణం బంద్: దేవినేని ఉమ