telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గవర్నర్‌ తమిళి సైని కలిసిన సీఎం కేసీఆర్

KCR governor tamilisai

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ను సీఎం కేసీఆర్‌ సోమవారం రాజ్ భవన్ లో కలిశారు. దాదాపు రెండున్నర గంటల పాటు గవర్నర్ తో కేసీఆర్ వివిధ అంశాల పై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ యాక్ట్‌, ఆర్టీసీ ప్రైవేటీకరణతో పాటు పలు అంశాలపై గవర్నర్‌తో కేసీఆర్‌ చర్చించినట్టు తెలుస్తోంది.

ప్రధానంగా ఆర్టీసీపై ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను కేసీఆర్‌ గవర్నర్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి కూడా కేసీఆర్‌ గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం.

Related posts