మాజీ సీఎం చంద్రబాబు పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని పేరుతో రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు. రాజధానిలో నాలుగు బిల్డింగ్లని 57శాతం నుంచి 90శాతం వరకు కట్టారని, అంతకంటే ఎక్కువ కట్టింది ఒక్కటి కూడా అమరావతిలో లేదన్నారు.
చంద్రబాబు రాజధానిలో తిరుగుతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏం చేశారని రాజధానిలో తిరగడానికి వెళ్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు హయంలో మోసపోయిన రైతులను కచ్చితంగా ఆదుకుంటామని చెప్పారు. ఎంత మందికి ప్లాట్లు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేశారని తెలిపారు.