telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అధికార దుర్వినియోగంపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

pawan-kalyan

అధికార దుర్వినియోగంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 100 రోజుల వైసీపీ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ పుస్తకాన్ని సైతం రచించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ ఆరోపించారు.

ఏ ఒక్క ప్రభుత్వమూ ఎక్కువ కాలం పాటు అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. నిరంకుశత్వాన్ని వ్యతిరేకించే సహజ లక్షణం ప్రజల స్వభావంలోనే ఉంటుంది. నిరంకుశ పాలనను అంతం చేసే శక్తి మనుషుల సహజ స్వభావంలోనే అభివ్యక్త మవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వం నుంచైనా అదే మనకు రక్షణగా నిలుస్తుంది’ అంటూ ప్రముఖ ఆంగ్ల రచయితశామ్యూల్స్ జాన్సన్ అన్న మాటలను ట్విట్టర్ లో షేర్ చేశారు.

Related posts