telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ విద్యా వార్తలు

నిరుద్యోగులకు ఏపి ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక…

MLC Elections in AP 5 unanimous

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక ఇచ్చింది. ఎప్పట్నుంచే పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త ఏడాది 2019కి ఒక్కరోజు ముందు ఏపీపీఎస్సీ 7 నోటిఫికేషన్లను విడుదల చేసింది. కాగా ఈ 7 నోటిఫికేషన్లకు ఆన్‌లైన్‌‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఏపీలో పలు ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,326 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆయా ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ ఏడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రూప్- 1..169, గ్రూప్- 2.. 446 ఉద్యోగాలతో పాటు మొత్తం 1,326 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

గ్రూప్ -1 పోస్టులకు జనవరి 7 నుంచి 28 వరకు, గ్రూప్ 2 పోస్టులకు జనవరి 10 నుంచి 31 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 5న గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష, జులై 18,19 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 292,ఎగ్జిక్యూటివ్ పోస్టులు -154, సాధారణ పరిపాలన శాఖలో ఏఎస్ వో పోస్టులు -150, సీనియర్ అకౌంటెంట్లు- 20,ఎక్సైజ్ శాఖలో ఎస్సై పోస్టులు – 50, పంచాయతీరాజ్ శాఖలో ఎక్స్ టెన్షన్ అధికారులు -40, డిప్యూటీ తహశీల్దార్లు -16, ఖజనా శాఖలో సీనియర్ అకౌంటెంట్లు- 13.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 405 లెక్చరర్ పోస్టుల భర్తీకి మత్స్య శాఖలోని 43 ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ పోస్టులకు జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 305 లెక్చరర్ పోస్టులకు ఫిబ్రవరి 5 నుంచి 26 వరకు, ఫిషరీస్ సబ్ సర్వీస్ లో 10 అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 8 వరకు, ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పోస్టులకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపాలని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వివరించింది.

Related posts