telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

గెలుపు దిశగా భారత్ టీం… నాలుగో టెస్టులో ఆసీస్ పై ఒత్తిడి…

india-Australia 4th test match

ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో నాలుగో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసినా, ఆతిధ్య జట్టు ను పరుగులు తీయకుండా పట్టు బిగించారు భారత ఆటగాళ్లు. దీనితో తడబడుతున్న ఆస్ట్రేలియా ను చూస్తుంటే, ఈ టెస్ట్ కూడా భారత్ కైవసం చేసుకుంటుందని అనిపిస్తుంది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 622/7 వద్ద డిక్లేర్ చేసిన అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ప్రారంభించిన కంగారూలు జాగ్రత్తగా ఆడుతూ పరుగులు పెంచే ప్రయత్నం చేశారు.

తొలిభాగస్వామ్యాన్ని అడ్డుకట్ట వేస్తూ, 72 పరుగుల వద్ద ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా (27)ను కుల్దీప్ పెవిలియన్ పంపాడు. ఇక ఆ తర్వాతి నుంచి భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆసీస్‌పై ఒత్తిడి పెంచారు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న మార్కస్ హారిస్‌ (79), షాన్ మార్ష్ (8)లను రవీంద్ర జడేజా పెవిలియన్ పంపగా, మార్నస్ లాబుస్‌చగ్నే (38)ను షమీ ఔట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి భారత్ కంటే 451 పరుగులు వెనకబడి ఉంది. ట్రావిస్ హెడ్ (11), పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (8) క్రీజులో ఉన్నారు.

Related posts