telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కశ్మీర్‌లో బీజేపీ నాయకుడు కిడ్నాప్

kashmir police firing

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. బీజేపీ నాయకులపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల బాండిపొరాకు చెందిన బీజేపీ నాయకుడు షేక్ వసీం బారి, ఆయన సోదరుడు, తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

గత వారం జరిగిన ఈ ఘటన నుంచి కోలుకోకముందే బారాముల్లాలో మరో బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. స్థానిక బీజేపీ నేత, మునిసిపల్ కమిటీ వాటర్‌గామ్ ఉపాధ్యక్షుడైన మెరాజుద్దీన్ మల్లాను ఉత్తర కశ్మీర్‌లో కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు మల్లా కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

Related posts