కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రైతు బిల్లులపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు అన్యాయం చేసే వ్యతిరేక బిల్లుని కేంద్రం తెచ్చిందని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ ఆరోపించారు. రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లు రద్దు కోసం ఈ నెల 31వ తేదీ వరకు సంతకాల సేకరణ చేపడతామన్నారు.
బీజేపీ గూండాలు దళితులపై అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. యూపీలో దళిత మైనర్ యువతిపై జరిగిన లైంగిక దాడి, హత్యను ఖండిస్తున్నామని షబ్బీర్ అలీ అన్నారు. వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు.