హిమాచల్ ప్రదేశ్ లో మూడంతస్తుల హోటల్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 15 మంది ఆర్మీ జవాన్లు సహా 35 మంది చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. హోటల్ కుప్పకూలిన సమయంలో 50 మంది జవాన్లు అల్పాహారం కోసం హోటల్ వద్ద ఆగారు. భవనం కూలిపోవడంతో వాళ్లలోని 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో చాలామంది ప్రాణాలు కోల్పోయినట్టు భావిస్తున్నారు.
next post
దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణ స్కూళ్లలో అధిక ఫీజులు: లక్ష్మణ్