నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మరోసారి స్టే ఇచ్చింది. క్యూరేటివ్ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లతో జాప్యం చేస్తున్నారు. నిర్భయ దోషులు ఉరి అమలును ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో తల్లి ఆశాదేవి తీవ్రంగా స్పందించారు. నిర్భయ దోషులను ఉరితీసేది ఇంకెప్పుడంటూ ప్రశ్నించారు.
న్యాయస్థానం తాను ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ఎందుకింత సమయం పడుతోందని అన్నారు. ఉరిశిక్ష అనేక పర్యాయాలు వాయిదా వేయడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి అమలు చేయాల్సి ఉంది. దోషుల్లో అందరికంటే చిన్నవాడైన పవన్ గుప్తా పిటిషన్ దాఖలు చేయడంతో పాటియాలా హౌస్ కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది.