telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

బంగారం ధర మళ్లీ పెరిగింది!

gold and silver prices in markets

దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన నెలకొనడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు తరలించడంతో పసిడి ధర మళ్లీ రూ.45 వేలు దాటింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పసిడి రూ.770 పెరిగి రూ.45,340కి చేరుకున్నది. గురువారం ధర రూ.44,570 వద్ద ఉన్నది.

మదుపరుల తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన బంగారం వైపు తరలించడంతో ధరలు ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వర్గాలు వెల్లడించాయి. పసిడితోపాటు వెండి మరింత పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి రూ.190 అధికమై రూ.48,180కి చేరుకున్నది.

Related posts