తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, టైంస్లాట్, సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు మూడు గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.45 కోట్ల ఆదాయం లభించింది. శ్రీవారి తెప్పోత్సవాల్లో భాగంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.