telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

కాణిపాకం వినాయక ఆలయం వద్ద అగ్నిప్రమాదం

fire building

కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయానికి దగ్గరలో ఉన్న జై గణేష్‌ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్‌లో ఉన్న నెయ్యి డబ్బాలకు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హోటల్‌లోని సిలిండర్లను బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

Related posts