కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యతిరేకించారు. వ్యవసాయానికి సంబంధించి మూడు దోపిడీ బిల్లులను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. దోపిడీ బిల్లులు రైతులను తమ పొలాలు ధనవంతులకు తనఖా పెట్టిస్తాయని చెప్పారు.
ఈ బిల్లు రైతులను తమ సొంత భూమిలోనే కూలీలుగా మారుస్తుందని అన్నారు. ఎంఎస్పీని నిర్ణయించే మార్కెట్లను అంతం చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు.పంజాబ్లోని రైతులు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన వ్యవసాయ బిల్లులను రైతులు వ్యతిరేకిస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థను నాశనం చేశారు: చంద్రబాబు