telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీ ప్రభుత్వం ఒక దోపిడీ బిల్లును తీసుకొచ్చింది: అఖిలేశ్‌ యాదవ్‌

Akhilesh Yadav

కేంద్ర ప్ర‌భుత్వం రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ‌ బిల్లులను సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ వ్యతిరేకించారు. వ్యవసాయానికి సంబంధించి మూడు దోపిడీ బిల్లులను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. దోపిడీ బిల్లులు రైతులను తమ పొలాలు ధనవంతులకు తనఖా పెట్టిస్తాయని చెప్పారు.

ఈ బిల్లు రైతులను తమ సొంత భూమిలోనే కూలీలుగా మారుస్తుందని అన్నారు. ఎంఎస్‌పీని నిర్ణయించే మార్కెట్లను అంతం చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు.పంజాబ్‌లోని రైతులు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన వ్యవసాయ బిల్లులను రైతులు వ్యతిరేకిస్తున్నారు.

Related posts