దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో అదనంగా సీట్లను పెంచింది. నవోదయ స్కూళ్ల లో మరో 5 వేల సీట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఉన్న సీట్ల సంఖ్య 46,600 నుంచి 51 వేలకు పెరిగింది. 2019-20 విద్యాసంవత్సరం నుంచి ఈ పెంపుదల అమలులోకి వస్తుందని ప్రకటించింది.
నవోదయ పాఠశాలల్లో ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు ప్రభుత్వం గురుకుల తరహా ఉచిత విద్యనందిస్తుంది. 2001లో దేశ వ్యాప్తంగా సుమారు 6లక్షల మంది నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు హజరుగా, ఆ సంఖ్య 2019 లో 31 లక్షలకు చేరింది.
పెద్దమ్మ గుడిలో వీహెచ్.. ప్రమాణానికి రాని కేటీఆర్!