ప్రధాని నరేంద్ర మోదీ నేడు చివరి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నారు. రాష్ట్రపతితో ప్రధాని అపాయింట్ మెంట్ సాయంత్రం 6 గంటలకు ఖరారైందని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. అంతకన్నాముందు జరిగే క్యాబినెట్ భేటీలో, మంత్రిమండలిని, ఆపై 16వ లోక్ సభ ను రద్దు చేస్తూ తీర్మానం చేయనున్నారు.
జూన్ 3న ప్రస్తుత లోక్ సభ కాలపరిమితి ముగియనుండగా, అందుకు 9 రోజుల ముందే సభ రద్దు కానుంది. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించిన తరువాత వారణాసిలో మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 29న ఆయన మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.