telugu navyamedia
రాజకీయ వార్తలు

సుష్మా స్వరాజ్ నిర్ణయం పై నెటిజన్ల హర్షం

బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. న్యూఢిల్లీ సఫ్ద్దర్‌జంగ్ రోడ్డులోని నా అధికార నివాసాన్ని ఖాళీ చేశాను. పాత చిరునామా, ఫోన్ నెంబర్లలో నేను అందుబాటులో ఉండని విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సుష్మ నిర్ణయం పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ఇతర రాజకీయ నేతలకు సుష్మ ఉదాహరణగా నిలిచారని ప్రశంసించారు. ఎన్నికల్లో ఓటమి పాలై, అధికారంలో లేకపోయినా ఏండ్లుగా అధికార నివాసాలను ఖాళీ చేయని రాజకీయ నేతలపై విమర్శలు గుప్పించారు. దేశంలో అత్యంత శక్తిమంతమైన మహిళా రాజకీయ నాయకురాలిని మిస్ అవుతున్నామంటూ మరి కొందరు ట్వీట్ చేశారు.

Related posts