తెలంగాణ సీఎల్పీ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడతున్నట్లు ప్రకటించడంతో నేతల్లో మళ్లీ గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్పీ అత్యవసర సమావేశమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి 15మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కాగా, ఉపేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి గైర్హాజరు అయ్యారు.
ఈ భేటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, గండ్ర వెంకట రమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, జగ్గారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సురేందర్, పొడెం వీరయ్య, హరిప్రియ నాయక్, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు హాజరు అయ్యారు.ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడతున్నట్లు ప్రకటించడంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. తాము త్వరలోనే టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.