telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఒక్క వరద దెబ్బకే సీఎం కెసిఆర్ బిచ్చం మెత్తుకుంటున్నాడు : కోమటిరెడ్డి

komati-venkat-reddy mp

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్ వరదల దృష్ట్యా ఈ కోమటిరెడ్డి ఈ విమర్శలు చేశారు. “దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రం అని సీఎం కేసీఆర్ గారు గొప్పలు చెప్పుకున్నారు.. ఇప్పుడేమో ఒక్క వరద దెబ్బకే దానం చేయండి బాబు అంటూ విరాళాల కోసం బిచ్చం మెత్తుకుంటుండు . మీ పాలనలో ధనికులైన మీ పార్టీ నాయకులను, “జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను” ముందుగా వేడుకోండి. అధికారంలో ఉండి సంపాదించుకోవడమే కాదు నయనా..? కాస్త జనానికి పెట్టండని చెబితే వాళ్లయినా వింటారేమో..! కనీసం వరద బాధితులను పలకరించే కనికరం కూడా మీరు చూపలేకపోయారు. పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మాత్రం వరద బాధితులను ఆదుకునేందుకు దానాలు చేయమంటున్నారు. కరోనా వైద్యం కోసం కూడా పారిశ్రామిక వర్గాల నుంచి భారీగా విరాళాలు సేకరించారు. కనీసం వాటికి లెక్కపత్రామేమైనా ఉందా..? వాటిని ఎవరి కోసం ఖర్చు పెట్టారో చెబుతారా.. సీఎంగారూ..!” అంటూ సీఎం కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి.

Related posts