telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత దేశం ఎప్పటికీ ప్రపంచ శాంతినే కోరుకుంటుంది: అమిత్​ షా

amith shah bjp

భారత దేశం ఎప్పటికీ ప్రపంచ శాంతినే కోరుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. గత పది వేల ఏళ్ల చరిత్ర చూసినా భారత దేశం ఎప్పుడూ కావాలని ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ జీ) నిర్వహించిన కార్యక్రమంలో షా మాట్లాడుతూ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ హయాంలోనే దేశ రక్షణ రంగంలో దూకుడు పెరిగిందని అన్నారు.

విదేశాంగ విధానానికి, డిఫెన్స్ పాలసీకి ముడిపెట్టడం మోదీ హయాంలోనే ఆగిపోయిందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ తరహాలో సర్జికల్ స్ట్రైక్స్ చేసే దేశాల జాబితాల ఇండియా చేరిందని చెప్పారు. మన దేశంలో శాంతిని చెడగొట్టే ప్రయత్నాలను సాగనివ్వలేదని గుర్తు చేశారు. మన సైనికుల ప్రాణాలు తీసుకునేవారికి తగిన విధంగా సమాధానం ఇస్తున్నామని పేర్కొన్నారు.

Related posts