చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో నిన్న జవాన్లకు మావోలకు మధ్య జరిగిన భారీ ఎన్ కౌంటర్లో పెద్ద సంఖ్యలో జవాన్లు గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పుడు వారందరూ అటవీ ప్రాంతంలో మృతి చెందినట్టు గుర్తించారు. సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 17 మంది జవాన్లు మరణించారు. నేడు వారి మృతదేహాలు ఉన్న అటవీ ప్రాంతానికి భద్రతాబలగాలు చేరుకున్నాయి.
ఈ ఎన్ కౌంటర్ లో మరో 15 మంది జవాన్లకు గాయాలయ్యాయి. ఎదురుకాల్పుల అనంతరం భద్రతాసిబ్బంది ఆయుధాలను మావోలు ఎత్తుకెళ్లారు. నక్సల్స్ ఎత్తుకెళ్లిన ఆయుధాల్లో శక్తిమంతమైన గ్రెనేడ్ లాంచర్ తో పాటు అత్యాధునిక ఆయుదాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
టీడీపీ హయాంలో ఇళ్లు ఇవ్వడానికి కూడా లంచాలు: మంత్రి వెల్లంపల్లి