telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

వావ్ షాకింగ్ ట్విస్ట్… వైఎస్సార్సీపీలో చేరిన సీబీఎన్…!!?

Chandrababu-and-jagan

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సందర్భానుసారంగా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తుంటారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడుకు టార్గెట్ చేసిన వర్మ మరోసారి ఆయనపై షాకింగ్ పోస్ట్ ను చేశారు. ఈ పోస్ట్ లో చంద్రబాబు నాయుడు వైసిపిలో చేరినట్లుగా, ఆయనను స్వయంగా జగన్ కండువా కప్పి ఆహ్వానిస్తున్నట్లుగా ఫోటోను మార్ఫింగ్ చేసి, “వావ్ షాకింగ్ ట్విస్ట్… వైఎస్సార్సీపీలో చేరిన సీబీఎన్” అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. వర్మ షేర్ చేసిన ఈ ఫోటో కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కొంతమంది వర్మ క్రియేటివిటీని మెచ్చుకోగా… మరికొందరు మాత్రం విమర్శలు చేశారు. తాజాగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. చంద్రబాబును అవమానించేలా సోషల్ మీడియాలో వర్మ పెట్టిన పోస్టింగ్‌ లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ కార్యకర్తలు, దేవి వీర వెంకట సత్యనారాయణ చౌదరి హైదరాబాద్‌ లోని బాచుపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ వీడియో పోస్ట్ చేసే కొన్ని గంటల ముందే వర్మ కేఏ పాల్ కు సంబంధించిన వీడియోపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. “ఆయన్ను వెంటనే గొలుసులతో కట్టేయకపోతే కరుస్తాడేమో!” అంటూ ట్వీట్ చేసిన వర్మ పాల్ వీడియోను పోస్ట్ చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నర్సాపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పాల్ రోడ్డుపై గెంతుతూ, డ్యాన్స్ చేసుకుంటూ ఆనందం తట్టుకోలేక పరుగు అందుకున్నారు. అనంతరం కారులో ఎక్కి భీమవరం అసెంబ్లీ సీటుకు నామినేషన్ వేసేందుకు వెళ్లిపోయారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

Related posts