telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్ సమావేశంలో రసాభాస.. పార్టీ నేతల మధ్య ఘర్షణ!

congress-logo

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు సంసిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు నిర్వహించారు.

జనగామ, యాదాద్రి జిల్లాల నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడటంతో ఇరువర్గాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ముందే ఘర్షణకు దిగారు. దీంతో, సమావేశం నుంచి జనగామ జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అర్థాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.

Related posts