టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రజల మనస్సులో కోడెల జ్ఞాపకాలను ఎవరు చెరిపివేయలేరని చంద్రబాబు తెలిపారు.
ఏపీ శాసనసభ తొలి స్పీకర్ గా ఆయన నిర్వహించిన పాత్ర ఆదర్శనీయం అని కొనియాడారు. రాజకీయ కక్ష సాధింపులతో కోడెలను బలితీసుకుని, ఇప్పుడు ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను కూడా అడ్డుకోవాలనుకోవడం ప్రభుత్వ దుర్మార్గం అని మండిపడ్డారు.
కోడెల ప్రజాసేవ గురించి కోటప్పకొండ ఆలయం చెబుతుందని తెలిపారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కన్వీనర్ గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమాలు ఆయన పట్టుదలకు నిదర్శనం అని కీర్తించారు. రాజకీయనేతగా పల్నాటి పులి అనిపించుకున్నారని పేర్కొన్నారు.